EVM Ban

EVM Ban: గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా.. ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

EVM Ban: ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పీబీ వరాలే ధర్మాసనం పిటిషనర్‌తో మాట్లాడుతూ – పార్టీలకు ఈవీఎంతో సమస్య లేదు, మీకు ఎందుకు ఉంది? మీకు అలాంటి ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? అని ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్‌ కేఏ పాల్‌ సమాధానమిస్తూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఈవీఎం) ట్యాంపరింగ్‌పై చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంటి నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పారు. అయితే, చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని అంటున్నారని, గెలిచినప్పుడు దానిపై మాట్లాడడం లేదని ధర్మాసనం పేర్కొంది.

EVM Ban: ఇలాంటి పరిస్థితిలో ఈవీఎంలపై ఎలా మనం మాట్లాడగలం? అయినా ఇలాంటి వాటిపై చర్చకు కోర్టు వేదిక కాదు. మీరు ఈ రాజకీయ విషయాల్లోకి ఎందుకు వస్తున్నారు? మీ పని వేరే రంగంలో ఉందికదా. అది రాజకీయాలకు చాలా భిన్నమైనది కదా? అంటూ కెఏ పాల్ ను పిటిషన్  వేసినందుకు అనేక ప్రశ్నలు సంధించింది కోర్టు. 

3 లక్షలకు పైగా అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన ఎన్జీవో సంస్థకు పాల్ అధ్యక్షుడనే విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *