AP Govt

AP Govt: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. అమరావతిలో ప్రత్యేక కేంద్రం!

AP Govt: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో మరో ముఖ్యమైన అడుగు పడింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ మరియు క్యూర్ ఏఐ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా అమరావతిలో దేశంలోనే తొలిసారిగా ‘ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

1. అమరావతిలో అధునాతన క్యాన్సర్ పరీక్షల కేంద్రం

ఈ ఒప్పందంలో భాగంగా ‘ఆస్ట్రాజెనెకా ఇండియా’ సంస్థ అమరావతిలో ఒక ప్రత్యేక జన్యు పరిశోధనా కేంద్రాన్ని (Integrated Genomic Solutions Center) ఏర్పాటు చేయనుంది.

ఈ కేంద్రం ద్వారా ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బాధితులకు అవసరమైన అధునాతన జన్యు పరీక్షలు చేస్తారు.దీనివల్ల క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించి, రోగులకు మరింత వేగంగా, కచ్చితమైన వైద్యం అందించడానికి వీలవుతుంది.

2. అందరికీ తక్కువ ధరలోనే నాణ్యమైన వైద్యం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలను తక్కువ ధరలోనే అందుబాటులోకి తేడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

వైద్య సేవలతో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు.ఈ భాగస్వామ్యంతో ఏపీ హెల్త్‌కేర్ – రీసెర్చ్ రంగాలు సరికొత్త ఎత్తుకు ఎదుగుతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *