Mamata banerjee: ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి.. ఏ పార్టీతో పొత్తు ఉండదు

Mamata banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని తెలిపారు.

కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ కూటమి ఉండదని మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. బెంగాల్ ప్రజలే తమ బలమని, వారి ఆశీర్వాదంతోనే ఎన్నికల బరిలో నిలుస్తామని చెప్పారు.

ప్రజల సమస్యలను నేరుగా ప్రజలకే చెప్పి మళ్లీ వారి నమ్మకాన్ని పొందుతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *