అదృష్టమంటే ఆమెదే. అతి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలు కాపాడుకుంది. కాదు.. ఆమె ప్రాణాలు కాపాడింది ఒక ఆర్బీఎఫ్ కానిస్టేబుల్. రైలు కింద పడబోయిన మహిళా ప్రయాణికురాలిని ఓ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన ఉడిపి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ఉడిపి రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.
మంగళూరు మడ్గావ్ ప్యాసింజర్ రైలు స్టేషన్లో రైలు వేగంగా కదులుతుండగా ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంలో, పట్టుజారి ఆ మహిళ పకిందికి పడిపోయింది. ట్రైన్ కు ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఆమె పడిపోయింది. అక్కడే ఉన్న ఒక రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఈ సంఘటన గమనించింది. సెకన్లలో స్పందించింది. వేగంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ఆ మహిళను కాపాడటానికి ప్రయత్నాలు చేసింది. ఆ మహిళా కానిస్టేబుల్ వేగవంతంగా స్పందించక పోతే కనుక ఆ మహిళ ప్రాణాలకు ముప్పు వచ్చేది. ఆర్పిఎఫ్ సిబ్బంది త్యాగానికి రైల్వే శాఖ సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి.