Delhi Assembly Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై సందీప్ దీక్షిత్కు టికెట్ ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ పేరును ఆప్ ఇంకా ప్రకటించలేదు.
బద్లీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, బల్లిమారన్ నుంచి మాజీ మంత్రి హరూన్ యూసుఫ్, పట్పర్గంజ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు చౌదరి అనిల్ కుమార్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, సల్మాన్ ఖుర్షీద్, టీఎస్ సింగ్ డియో, మధుసూదన్ మిస్త్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Supreme court: దేవాలయాలు-మసీదుల వివాదాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం*
Delhi Assembly Election: ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరి 23, 2025తో ముగుస్తుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు, 2015లో 67 సీట్లు గెలుచుకుంది.