Keerthy Suresh: ప్రముఖ నటి, జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ వివాహం తన చిరకాల మిత్రుడు ఆంటోనీతో గోవాలో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేశ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. పదిహేళ్ళుగా పరిచయం ఉన్న ఆంటోనిని త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ కొంతకాలం క్రితం కీర్తి సురేశ్ ప్రకటించింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. చిరకాల ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వారకూ ఆమె తీసుకెళ్ళింది. హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకున్న తర్వాత క్రిస్టియన్ పద్థతిలోనూ వీరు వివాహం చేసుకుంటున్నారు. విశేషం ఏమంటే… ఇదే నెల 25న కీర్తి సురేశ్ నటించిన ‘బేబీజాన్’ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆమెకు బాలీవుడ్ లో మొదటి చిత్రం!
ఇది కూడా చదవండి:Sai Pallavi ఇక సహించేది లేదన్న సాయిపల్లవి!
భయపడనంటున్న నయన్!
నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదని స్టార్ హీరోయిన్ నయనతార చెప్పింది. ధనుష్ లాంటి స్టార్ హీరో చర్యలను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాయడానికి తాను భయపడలేదని తెలిపింది. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలోని ఓ డైలాగ్ ను తమ డాక్యుమెంటరీలో ఉపయోగించుకుంటే ఎంతో అర్థవంతంగా ఉంటుందని భావించామని, దానికి అనుమతి ఇవ్వమని కోరడానికి ఎంత ప్రయత్నించినా ధనుష్ అందుబాటులోకి రాలేదని నయన్ తెలిపింది. విఘ్నేష్, తాను, తన మేనేజర్స్ ధనుష్ ను కలవడానికి ప్రయత్నించామని అంది. ధనుష్ తో తనకు ఎప్పుడూ వైరం లేదని
భయపడనంటున్న నయన్!: కానీ ఎవరి చెప్పుడు మాటల వల్ల ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదని వాపోయింది. తనపై పది కోట్ల నష్టపరిహారం దావా వేయడంపై నయన్ అసహనం వ్యక్తం చేసింది. అయితే ధనుష్ ఇప్పుడు కోర్టులోనూ కేసు వేయడంతో నయన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థకు జనవరి 8న లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. మరి ఈ విషయంలో నయన్ తరఫున లాయర్లు ఏం బదులిస్తారో చూడాలి. అలానే ‘జవాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్… షారూఖ్ ఖాన్ కోసమే ఆ సినిమాలో నటించానని చెప్పింది.