Banana: అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలలో ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తినగలిగే పండు ఇదే. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నప్పటికీ, వీటిని ఎక్కువగా తినడం వల్ల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు తింటే శరీరానికి మంచిదని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ అరటిపండు చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, పొటాషియం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాలను ఇక్కడ తెలుసుకుందాం.
అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అరటిపండ్లు ఎక్కువగా తినడం ప్రారంభిస్తే శరీరంలో పీచు స్థాయి పెరుగుతుంది. అప్పుడు బరువు తగ్గడానికి బదులు పెరగడం మొదలవుతుంది. అరటిపండులో చక్కెర కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండును మితంగా తీసుకోవాలి. అరటిపండులో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ ఎక్కువ. అరటిపండులో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండ్లను పెద్ద మొత్తంలో తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు రోజూ అరటిపండ్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లలో టైరమైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మైగ్రేన్లను కూడా ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ బాధితులు అరటిపండ్లు తినకూడదు.