Shaik Haseena: 20 నిమిషాల్లో ప్రాణం కపడుకున్నా..

Shaik Haseena: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆడియో ఒక సంచలనం సృష్టించింది. గత ఏడాది ఆగస్టులో ప్రాణభయం కారణంగా ఆమె దేశం విడిచి పారిపోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఆన్‌లైన్‌లో ఆమె ఆడియోను విడుదల చేసింది.

ఆ ఆడియోలో, హసీనా తన ప్రాణాలను కాపాడిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె రాజకీయ ప్రత్యర్థులు తనను చంపేందుకు కుట్ర పన్నినట్లు చెప్పారు. “ఆగస్టు 5వ తేదీన సోదరి రెహానాతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాను. కేవలం 20-25 నిమిషాల్లోనే నా ప్రాణాలు కాపాడుకున్నానని అనిపించింది,” అని ఆమె ఆడియోలో పేర్కొన్నారు.

ఆ ఆడియోలో, “2004లో ఆగస్టు 21న నాకు గ్రేనేడ్ దాడి జరిగినప్పుడు, బంగ్లాదేశ్‌లో నా ప్రాణాలకు హానీ జరిగిందని అల్లా కాపాడినట్లు అనిపించింది,” అని హసీనా చెప్పుకొచ్చారు. “ఆ రోజున జరిగిన అటాక్‌ నుంచి అల్లా నన్ను కాపాడి, ప్రాణాలను రక్షించారు,” అని ఆమె వివరించారు.

తాను తీవ్ర బాధలో ఉన్నట్లు ఆ ఆడియోలో హసీనా తెలిపారు. “నాకు దేశం లేదని, ఇళ్లు లేకపోతే అన్నింటినీ పోగొట్టుకున్నానని నేను భావిస్తున్నాను,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun Case: సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు.. పోలీసుల వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *