BJP CMs

State BJP Presidents: పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం..!

State BJP Presidents: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP)లో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన మూడు జిల్లాల అధ్యక్షుల నియామక వ్యవహారానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. రాష్ట్రంలోని కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఈ కొత్త నియామకాలను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు వీరే..

జిల్లా పేరు నూతన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
కరీంనగర్ సాయి మల్లేశం (Sai Mallesham)
వికారాబాద్ యు. రమేశ్ (U. Ramesh)
మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) డి. గిరివర్ధన్ రెడ్డి (Girivardhan Reddy)

ఈటల – బండి సంజయ్ విభేదాల వల్లే ఆలస్యం?

ఈ మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలో పార్టీ కీలక నేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల మధ్య తీవ్ర పోటీ, విభేదాలు నెలకొన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో నడిచింది. తమ తమ అనుచరులకు, వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు నేతలు పట్టుబట్టడంతో గత కొంతకాలంగా ఈ నియామకాలను రాష్ట్ర నాయకత్వం హోల్డ్‌లో పెట్టింది.

అయితే, ఇటీవల ఇరువురి నేతల మధ్య విడతల వారీగా చర్చలు జరిగి, ఆధిపత్య పోరు పక్కనబెట్టి సయోధ్య కుదరడంతో మార్గం సుగమమైంది. ఇరు వర్గాలకూ ఆమోదయోగ్యమైన, నిబద్ధత గల నాయకుల పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్ర అధినాయకత్వం ఈ తుది నిర్ణయం తీసుకుంది. అధ్యక్షులుగా ఎంపికైన నాయకులకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *