PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (BJP) దేశవ్యాప్తంగా భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న అరుదైన మైలురాయిని పురస్కరించుకుని గురువారం నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సాగిన పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా ‘సేవా సంకల్ప అభియాన్’..
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు..
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విద్యా, సామాజిక సేవా రంగాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల రోజుల ప్రచారానికి అక్టోబర్ 17న అధికారికంగా ముగింపు పలకనున్నారు. ఆ రోజున దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల సమీక్షతో పాటు భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్య సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
