Nara lokesh: ఎస్జీటీ బదిలీల్లో కీలక మార్పు: ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు గుడ్‌బై, మాన్యువల్ కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్

Nara lokesh: రాష్ట్రంలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్లు) బదిలీల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ అధికారికంగా వెల్లడించారు.

ఇటీవల ప్రభుత్వం పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఎస్జీటీ బదిలీల విషయంలో కొన్ని అభ్యంతరాలు, సమస్యలు వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, దీనిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. వారి సూచనలతో పాటు అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, చివరికి మాన్యువల్ కౌన్సెలింగ్‌ విధానానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ఉపాధ్యాయుల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభించనుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: ఈ రాశి వారు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *