Maha Kumbh 2025:

Maha Kumbh 2025: మ‌హాకుంభ‌మేళాకు మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము అప్పుడే రాక‌!

Maha Kumbh 2025: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్స‌వంగా మ‌హాకుంభ‌మేళా గుర్తింపు పొంద‌నున్న‌ది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగరాజ్‌లో జ‌రుగుతున్న ఈ మ‌హా కుంభ‌మేళాకు భ‌క్తులు కోట్లాదిగా త‌ర‌లివ‌స్తూ ఇక్క‌డి త్రివేణి సంగ‌మంలో పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తూ, మొక్క‌లు చెల్లించుకుంటున్నారు. దేశ‌వ్యాప్తంగా భార‌తీయుల‌తోపాటు విదేశీయులు సైతం పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.

Maha Kumbh 2025: ఈ మ‌హాకుంభ‌మేళాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, రాష్ట్ర‌ప‌తి, ఇత‌ర ప్ర‌ముఖులు ఎప్పుడొస్తార‌నే విష‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొన్న‌ది. హైంద‌వ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డ‌మే కాక ఆచ‌రిస్తూ వ‌స్తున్న ప‌లువురు ప్ర‌ముఖుల రాకపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఫిబ్ర‌వ‌రి 5న మ‌హా కుంభ‌మేళాలో పాల్గొంటారని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

Maha Kumbh 2025: అదే విధంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఫిబ్ర‌వ‌రి 10న‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జ‌న‌వ‌రి 27న, ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ ఫిబ్ర‌వ‌రి 1న మ‌హా కుంభ‌మేళాలో పాల్గొని, ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగ‌మంలో పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తార‌ని స‌మాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ap news: ఏపీ మార్కాపురంలో మూడు కాలేజీల‌ బీటెక్ విద్యార్థుల డిష్యుం డిష్యుం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *