Kishan reddy: చరిత్రలో నిలిచిపోయే రోజు.. కిషన్ రెడ్డి హై వోల్టేజ్ కామెంట్స్

Kishan reddy: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు.

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా ఆర్మూర్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిను కేంద్రం నియమించింది. ఆయన ఇవాళ తన బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, “జాతీయ పసుపు బోర్డును ప్రారంభించడం పసుపు ఉత్పత్తిదారుల జీవితాల్లో కీలక మార్పులకు దోహదపడుతుంది. ప్రపంచ మార్కెట్లో భారతీయ పసుపు విలువను పెంపొందించడమే కాకుండా, రైతులకు కొత్త అవకాశాలను అందిస్తుంది. పసుపు ఉత్పత్తిలో కొత్త ఆవిష్కరణలు, విలువ జోడించడం, మార్కెట్లో సరఫరా సదుపాయాల బలోపేతం జరిగేలా చేస్తుంది. రైతులు, వినియోగదారులు అందరూ ఈ నిర్ణయం ద్వారా లాభపడతారు,” అని వ్యాఖ్యానించారు.

ఇది కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకున్న మరో గొప్ప ముందడుగుగా భావించవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manipur: మణిపూర్ కు మరిన్ని భద్రతా దళాలు.. కేంద్రం ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *