Karnataka High Court: కర్ణాటకలో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్జెండర్కు రెండు పేర్లతో మార్పులు చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని రిజిస్ట్రార్ ఆఫసర్ ను హైకోర్టు ఆదేశించింది.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని ట్రాన్స్జెండర్గా మారాడు.
సర్టిఫికేట్
తనకు మరుపులు చేసిన జనన ధృవీకరణ పత్రం కావాలి అని కోరుతూ మంగళూరు కార్పొరేషన్లోని జనన, మరణ ధృవీకరణ పత్రాల రిజిస్ట్రార్కు దరఖాస్తు చేశాడు అయన. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం 1969 ప్రకారం ఇలాంటి సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని ట్రాన్స్జెండర్ దరఖాస్తును రిజిస్ట్రార్ తిరస్కరించారు. దింతో అయన లింగనిర్ధారణతో కూడిన సర్టిఫికేట్ జారీ చేసేలా రిజిస్ట్రార్ను ఆదేశించాలని కోరుతూ ట్రాన్స్జెండర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది నిన్న విచారణకు వచ్చింది.
అప్పుడు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు:
లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్జెండర్గా మారిన వారికి లింగమార్పిడి వివరాలతో మరుపులు చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి ట్రాన్స్జెండర్ హక్కుల రక్షణ చట్టం – 2019 అనుమతిస్తుంది అని తెలిపారు.
రక్షణ చట్టం
Karnataka High Court: అయితే, ఈ సవరణ వారి ఒరిజినల్ సర్టిఫికేట్పై నిర్వహించబడదు. పిటిషనర్ దరఖాస్తును రిజిస్ట్రార్ తిరస్కరించడం అనేది జనన మరణాల నమోదు చట్టం – 1969 ప్రకారం సరైనదే. అదే సమయంలో, వారికి సవరించిన ప్రమాణపత్రాన్ని తిరస్కరించడం హక్కుల ఉల్లంఘన.
కాబట్టి, లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్జెండర్లకు లింగ మెరుపులు సర్టిఫికేట్ జారీ చేయాలని సంబంధిత రిజిస్ట్రార్ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. సర్టిఫికేట్ లో తప్పనిసరిగా వ్యక్తి ముందు ఉన్న పేరు.. తర్వాత మార్చిన పేరు జెండర్ ని ఉంచాలి. అవసరమైన మరుపులు చేసే వరకు జనన మరణాల నమోదు చట్టం – 1969 అమలులో ఉంటుంది.
ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం – 2019 జనన మరణాల నమోదు చట్టం – 1969 నిబంధనలకు సవరణలు ప్రతిపాదించాలని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర లా కమిషన్కు కోర్టు సిఫార్సు చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది.