Meenakshi Chaudhary: అదంతా అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే విడుదల కానున్న మట్కా, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. గుంటూరు కారంలో మహేశ్ బాబుకు జంటగా నటించినా ఎక్కువసేపు తెరపై కనిపించలేదు. ఇక ఈ అమ్మడు తాజా తమిళ్ లో శింబుతో జోడీ కట్టేందుకు రెడీ అయింది. ఇదంతా బాగానే ఉన్నా.. మీనాక్షి చౌదరీకి చెందిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. దీనిపై చివరికి ఈ అమ్మడు క్లారీటీ ఇచ్చుకోవల్సి వచ్చింది.

తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్‌ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి తన గురించి మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో మీనాక్షి చౌదరీ ఓ కీలక రోల్ చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను మీనాక్షి చౌదరి స్పందించింది. విశ్వంభరలో తాను నటిస్తున్నట్టుగా వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా ప్రకటిస్తానని చెప్పేసింది. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర సినిమాను 2025 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. ఈసారి విడుదల తేదీ విషయంలో మార్పు ఉండదని సమ్మర్‌కి కచ్చితంగా విడుదల చేసి తీరుతామంటూ నిర్మాతలు ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naresh: మహేశ్ తో నా అనుబంధం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *