Hyderabad: తలలు పగిలేలా కర్రలతో కొట్టుకుర్రు.. బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..

Hyderabad: హైదరాబాదులో ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఇవాళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘర్షణ సమయంలో, కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్‌పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమవ్వడంతో, పరస్పరం కర్రలతో దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటనలో బీజేపీ నేతలకు గాయాలయ్యాయి.పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Indian Army: ఈ ఏడాది ఐదు రోజులకో టెర్రరిస్టును హతమార్చాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *