Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. కమిషన్ సిఫార్సులు 2026 నుంచి అమల్లోకి వస్తాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడవ వేతన సంఘం 2016లో అమలులోకి వచ్చిందని, దాని సిఫార్సులు 2026 వరకు కొనసాగుతాయని ఆయన అన్నారు.
Government Employees: 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమీషన్ అమలవుతుంది. జనవరి 1, 2026 నుంచి మోడీ ప్రభుత్వం 8వ పే కమిషన్ను అమలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్లు పెరుగుతాయి.
Government Employees: దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ లాంచింగ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తుందని వైష్ణవ్ తెలిపారు. రూ.3985 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ నిర్ణయం న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. చంద్రయాన్, మంగళయాన్ వంటి చారిత్రాత్మక మిషన్లు ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యాయి.