Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి కొండా సురేఖ ఉదంతంలో సచివాలయ వేదికగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రమశిక్షణా చర్యల పేరిట ఆమెను కేబినెట్ నుంచి ప్రభుత్వం తప్పించిన కొద్దిరోజులకే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆమెకు కేటాయించిన ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం నాడు ఆ గదులకు తాళాలు వేసి పూర్తిగా సీల్ చేశారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆమె అధికారిక పేషీపై ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది.
4వ అంతస్తులోని ఛాంబర్ల సీజ్..
ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆమె మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సచివాలయంలోని ఆమె అధికారిక కార్యాలయాన్ని కూడా మూసివేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
