ED Raids: హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈడీ అధికారులు సుడిగాలి తనిఖీలు ప్రారంభించారు. ఈ సోదాలు ప్రముఖ పారిశ్రామికవేత్తలైన సురానా గ్రూప్ చైర్మన్ నరేందర్ సురానా, మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ సురానా ఇళ్లలో మరియు వారి ఆఫీసుల్లో కొనసాగుతున్నాయి.
సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో సమకాలీనంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. మనీలాండరింగ్ మరియు విదేశాలకు అక్రమంగా డబ్బులు తరలించిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ చర్యలకు దిగినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. మావో అగ్ర నేతలు హతం
ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ సోదాలు మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో వ్యాపార ప్రపంచంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ దాడులు చర్చనీయాంశంగా మారాయి.