AP DRO: ప్రజలు తప్పు చేస్తే చెప్పాలిసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా చేయడం బాధాకరం.కీలక సమావేశంలో సెల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ రిలాక్స్ అవుతు కనిపించిన అనంతపురం డిఆర్ఓ మలోలా. ఇపుడు ఈ వీడియో సోషలో మీడియాలో వైరల్ గా మారింది. కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణ ఏకసభ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులంతా హాజరుఅయ్యారు. ఈ కీలకమైన సమావేశంలో డిఆర్ఓ మలోల రమ్మీ ఆడుతూ గడపటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దింతో ఆర్డిఓ మలోలపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది.
