Supreme Court

Supreme Court: ఉచితాలకు బదులు..ఉద్యోగాలు ఇవ్వొచ్చుగా

Supreme Court: కేంద్రం సబ్సిడీలో ప్రజలకు రేషన్ ఇస్తూండనై రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు అందుకనే. ప్రజలను మభ్యపెట్టడానికి ఇష్టానుసారం రేషన్ కార్డులు జారీ చేస్తునే ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 

సోమవారం (డిసెంబర్ 9) ఆహార భద్రతా చట్టం కింద ఆహారాన్ని అందించడానికి సంబంధించిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు, పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించడానికి బదులుగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరింది.ఇంత పెద్ద స్థాయిలో రేషన్ అందించే విధానం కొనసాగితే, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తూనే ఉంటారు అని. ఎందుకంటే ధాన్యాలు అందించే బాధ్యత కేంద్రానికి ఉందని వారికి తెలుసు కాబట్టి. 

“ఉచిత రేషన్ అందించమని రాష్ట్రాలను అడిగితే, వారిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని చూపిస్తూ చేయలేమని చెబుతారు, అందువల్ల మరింత ఉపాధిని సృష్టించడంపై దృష్టి పెట్టాలి” అని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: 

రాష్ట్రాలు రేషన్‌కార్డుల జారీని కొనసాగిస్తేనే ఉంటే రేషన్‌కు చెల్లించాల్సిన అవసరం ఉందా అని కోర్టు ప్రశ్నించింది.

Supreme Court: జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం 80 కోట్ల మంది పేదలకు ప్రభుత్వం గోధుమలు, బియ్యం రూపంలో ఉచిత రేషన్‌ను అందజేస్తోందని కేంద్రం తరపు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ, దాదాపు 2 నుండి 3 కోట్ల మంది ప్రజలులకి ఈ పథకాలు అందడం లేదు అని కోర్టుకు తెలిపారు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద రేషన్ కార్డులుకి అర్హులైన వారిని గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డు లు ఇవ్వాలి అని . అందులో చల్ల మంది వలస కార్మికులు ఉండడం వలన వాళ్లకి అక్కడి గవర్నమెంట్ పటించుకోవడం లేదు అని కార్మికుల సమస్యలు దుస్థితిని ఎత్తిచూపుతూ చేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తోంది. నవంబర్ 19, 2024లోపు రేషన్ కార్డులను జారీ చేయాలి.

సోమవారం కోర్టు విచారణ సందర్భంగా ఎస్జీ మెహతా, పిటిషనర్ భూషణ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కోవిడ్ మహమ్మారి కారణంగా సుప్రీంకోర్టు 2020లో కేసును ప్రారంభించిందని ఎత్తి చూపిన సొలిసిటర్ జనరల్, భూషణ్ ప్రభుత్వాన్ని నడపడానికి విధానాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

దీనికి, భూషణ్ బదులిస్తూ, తన ప్రతిష్టకు చాలా హాని కలిగించే కొన్ని ఇమెయిల్‌లను SGకి వ్యతిరేకంగా ఒకసారి బహిర్గతం చేసినందున కేంద్రం తరపు న్యాయవాది తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సమాధానం ఇచ్చారు.

ఆ తర్వాత తదుపరి విచారణను 2025 జనవరి 8కి కోర్టు వాయిదా వేసింది.

ALSO READ  Donthi Madhava Reddy: సీఎం పర్యటనకు దూరంగా నర్సంపేట ఎమ్మెల్యే

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *