Mahanadu 2025

Mahanadu 2025: సినిమాలో,రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

Mahanadu 2025: సినిమాలో,రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని, తెలుగుదేశం పార్టీ శ్రద్ధాంజలి ఘనంగా నిర్వహించింది. మహానాడు ప్రారంభ దినంగా కొనసాగిన ఈ రోజు, పార్టీ అధ్యక్షుడు మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

ఎన్టీఆర్‌ గారి సేవలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబు మాట్లాడుతూ, “తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. రాజకీయాల్లోనూ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు” అని తెలిపారు.

“ఎన్టీఆర్‌ అంటే పేదవాడికి భరోసా, రైతులకు నేస్తం, మహిళలకు అండ, కార్మికులకు అభయం. ఆయన రాజకీయాలంటే ప్రజాసేవ అని నిర్వచనాన్ని మార్చేశారు” అని చంద్రబాబు అన్నారు.

Mahanadu 2025: ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌ జయంతిని పండుగలా జరుపుకోవడం తెలుగుజాతి ఆరాధనకు నిదర్శనమన్నారు. మహానాడు తొలి రోజున పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధానాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. “దేశ రాజకీయాల్లో పసుపు జెండా ఎగిరిపడింది. అది కొత్త ఒరవడికి నాంది పలికింది” అని చంద్రబాబు స్పష్టంచేశారు.

తెలుగు ప్రజల గర్వకారణంగా నిలిచిన ఎన్టీఆర్‌కు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఆశయాలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Daggubati Purandeswari: దగ్గుబాటి పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగభేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *