Delhi: ఇటీవల ఢిల్లీలోని ఆసుపత్రులు, విమానాశ్రయాలు, పాఠశాలలకు తరచూ ఫోన్, ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నారు.
ఈ క్రమంలో నిన్న ఢిల్లీలోని 10 పాఠశాలలకు ఓ రహస్య వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. అనంతరం పోలీసులు స్నిఫర్ డాగ్స్తో సంబంధిత పాఠశాలలకు వెళ్లి చూడగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఇది కూడా చదవండి: MLA Dead: అర్ధరాత్రి శుభ్రం చేస్తుండగా పేలిన తుపాకీ.. ఎమ్మెల్యే మృతి
దీంతో బాంబు బెదిరింపు బూటకమని తేలింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. ఈ బెదిరింపు కాల్స్ చేసింది ప్లస్ 2 విద్యార్ధి అని తేలింది. స్కూల్ కు సెలవులు ఇవ్వాలనీ.. పరీక్షలు వాయిదా పడాలనీ ఈ బెదిరింపులు చేసినట్టు ఆ విద్యార్ధి చెప్పడంతో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా నివ్వెరపోయింది.
తన స్కూల్ కు ఒక్కదానికే బెదిరింపు చేస్తే అనుమానం వస్తుందని ఏకంగా 23 స్కూళ్లకు బాంబు బెదిరింపులు, ఈ-మెయిల్ ద్వారా ఒక్కొక్కరికి ఆరుసార్లు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.