Nag Panchami 2026

Nag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!

Nag Panchami 2026: 17 ఆగస్టు 2026 (సోమవారం) నాడు నాగ పంచమి జరుపుకోనున్నారు. పూజకు ఉదయం 6 గంటల నుండి 8:10 వరకు శుభ ముహూర్తం ఉంది. గруడ పురాణం ప్రకారం ఇంటి ద్వారం వద్ద నాగ పూజ చేయడం శుభప్రదం. రాజా జనమేజయుని సర్ప యాగం నుండి ఆస్తీక మహర్షి సర్పాలను రక్షించిన రోజు కాబట్టి దీనిని నాగ పంచమిగా జరుపుకుంటారు. పాలు, తేనెతో నాగ ప్రతిమలకు అభిషేకం చేసి, ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి.

మరింత Nag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!
KTR

KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!

KTR: సిరికొండ మండలం పొన్నలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించి, బీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల సాయం అందించారు. పంట కొనుగోళ్లలో వైఫల్యం వల్లే ఈ మరణం సంభవించిందని, మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!
IUML:

IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!

IUML: తమిళనాడు రాజకీయాల్లో 1962 నుండి డీఎంకే కూటమిలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఆ కూటమికి గుడ్ బై చెప్పి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపింది. డీఎంకే స్థానిక నేతల పెత్తనం, సీట్ల కేటాయింపులో అసంతృప్తి దీనికి కారణం కాగా.. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ ఇప్పటికే టీవీకే కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ తెలిపారు.

మరింత IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!
Rukmini Vasanth

Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!

Rukmini Vasanth:నటి రుక్మిణి వసంతకు సంబంధించిన అభ్యంతరకర డీప్‌ఫేక్ వీడియోలను ఏఐ సాంకేతికతతో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో ముగ్గురిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నటి ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మానసిక వేధింపులకు గురిచేసేందుకే ఈ పని చేసినట్లు తేలింది. రుక్మిణి వసంత త్వరలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ లో కనిపించనున్నారు.

మరింత Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!
Jio IPO:

Jio IPO: ‘జియో’ ఐపీఓ కౌంట్‌డౌన్ షురూ.. !

Jio IPO: రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ (IPO) ప్రక్రియను అధికారికంగా ప్రకటిస్తూ.. సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు (DRHP) దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐపీఓ ద్వారా 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలు ఈ ప్రక్రియను లీడ్ చేస్తుండగా.. 2026 ప్రథమార్ధంలోనే జియో మార్కెట్లోకి రానుంది. ఎన్ఎస్ఈ ఐపీఓ పేపర్లు దాఖలు చేసిన మరుసటి రోజే జియో ఈ ప్రకటన చేయడంతో మార్కెట్లో మెగా ఐపీఓల హంగామా మొదలుకానుంది.

మరింత Jio IPO: ‘జియో’ ఐపీఓ కౌంట్‌డౌన్ షురూ.. !
bandi bhageerath

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బిజెపి నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

మరింత Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
Bandla Ganesh

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ ఉదారత్వం.. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ. 5 లక్షల భారీ సాయం!

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ హనుమకొండలో పర్యటించి, అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ బాబును పరామర్శించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చూపిన సేవా స్ఫూర్తితో, అలాగే నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సాయం అందించినట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఈ మొత్తాన్ని బాబు పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.

మరింత Bandla Ganesh: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ ఉదారత్వం.. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ. 5 లక్షల భారీ సాయం!
Chandrababu: 

Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం

Chandrababu:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతి ఉండవల్లి గుహల వద్ద జరిగిన ‘యోగాంధ్ర’ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని, యువత ఒత్తిడి తగ్గించుకోవడానికి టెక్నాలజీతో పాటు యోగా, ఆధ్యాత్మికత అవసరమని చెప్పారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీ, బాబా రామ్‌దేవ్‌లను కొనియాడారు. అలాగే రాష్ట్రంలో పచ్చదనాన్ని 31% నుండి 50% కి పెంచుతామని సీఎం ప్రకటించారు. చంద్రబాబు విజన్‌ను బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు.

మరింత Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం
Nagabandham Trailer

Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!

Nagabandham Trailer: విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ‘నాగబంధం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి, బ్రహ్మకమలం రహస్యాలను దక్కించుకోవాలనుకునే దుష్టశక్తిని దైవబలం మరియు నాగసాధువులు ఎలా అడ్డుకున్నారనేది కథ. ఎన్‌ఐకె స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రిచ్ విజువల్స్, అద్భుతమైన బిజీఎమ్‌తో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!
Gandhi Sarovar Project

Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!

Gandhi Sarovar Project: హైదరాబాద్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించనున్న ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ, సాంస్కృతిక మరియు వినోద కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. అనుమతులు రావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

మరింత Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!