Jharkhand

Jharkhand: దారుణం.. రెండోపెళ్లి వద్దన్నందుకు భార్యను చంపి.. ముక్కలుగా చేసి విసిరేశాడు

Jharkhand: జార్ఖండ్‌లో భార్యను గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరేష్ బెంగ్రా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాకు చెందినవాడు. అతని వయసు 25. మాంసాహార దుకాణంలో పని చేస్తున్నాడు. భార్యకు చెప్పకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని దక్షిణాది రాష్ట్రానికి పారిపోయాడు. భార్య భర్త కోసం వెతుకుతోంది. నరేష్ తన భార్యతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. అతను నవంబర్ 10న జార్ఖండ్‌కు తిరిగి వచ్చాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి 40 ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను అడవిలో పడేశాడు.

ఇది కూడా చదవండి: Karnataka High Court: పార్క్ లోకి పెట్స్ ని తీసుకువెళితే.. ఈ పని చేయాల్సిందే

Jharkhand: హత్య జరిగిన పక్షం రోజుల తర్వాత, నవంబర్ 24న, జోర్తాక్ గ్రామ సమీపంలో ఒక వీధి కుక్క మానవ శరీర భాగాలతో తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతంలో తమ పరిశోధన చేశారు. అప్పుడు అడవిలో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో నరేష్ బెంగ్రా తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది.  దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

తాను రెండో పెళ్లి చేసుకున్నానని తెలియగానే మృతురాలు తనతో గొడవ పడింది అని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తనను జార్ఖండ్ కు తిరిగి రావాలని పట్టుపట్టింది. దీంతో జార్ఖండ్ వెళ్లి ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. ఆమె అసలు వినలేదు. మరింత అల్లరి చేసింది. దీంతో నాకు కోపం వచ్చింది. అందుకే ఆమెను చంపి.. మృతదేహాన్ని అడవిలో 40 నుంచి 50 ముక్కలుగా నరికి విసిరేశాను అని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. నిందితుడు నరేష్ బెంగ్రా తమిళనాడులోని ఓ మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడని కేసు దర్యాప్తు చేసిన ఇన్ స్పెక్టర్ అశోక్ సింగ్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Skin Care Tips: ఎండ కారణంగా మీ ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. మెరిసే చర్మం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *