Earthquake: నాగాలాండ్‌లో భూకంపం.. ఇండ్ల నుంచి బయటకు పరుగు తీసిన జనం..

Earthquake: నాగాలాండ్‌లో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. కిఫిర్‌ నగరంలో గురువారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. భవనాలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కిఫిర్‌ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఉన్నట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Traffic Rules: ఆ రాష్ట్రంలో ఇకనుండి 'నో హెల్మెట్, నో పెట్రోల్' రూల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *