BJP Manifesto 2.0

BJP Manifesto 2.0: ఢిల్లీ ఓటర్లకు బీజేపీ ఉచిత తాయిలాలు.. రెండో మేనిఫెస్టో విడుదల

BJP Manifesto 2.0: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో విద్యార్థులకు అనేక వాగ్దానాలు చేసింది. ‘ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తాం’ అని అందులో ప్రకటించారు.

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు. 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ వింగ్, బహుజన సమాజ్ కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో తొలి భాగాన్ని 17న కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు విడుదల చేశారు. ఢిల్లీలో ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని దీనిలో పేర్కొంది. అలాగే వృద్ధులకు రూ.2,500, 70 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 చొప్పున పింఛను అందజేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: IT Raids: సినిమాల బ‌డ్జెట్, క‌లెక్ష‌న్ల‌ లెక్క తేలాల్సిందే.. రెండోరోజూ ఐటీ సోదాలు

ఇక ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ ఎన్నికల మేనిఫెస్టో రెండో భాగాన్ని విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇలా ఉన్నాయి.

* UPSC – స్టేట్ పబ్లిక్ సర్వీస్ బోర్డ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొదటి రెండు ప్రయత్నాలలో రూ.15,000 ప్రోత్సాహకం ఇస్తారు.
* ప్రాథమిక విద్య (కేజీ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యా పథకం అమలు చేస్తారు.
* ఐటీఐలు, పాలిటెక్నిక్‌లలో ప్రవేశం పొందిన షెడ్యూల్డ్ కులాలకు నెలవారీ రూ.1,000 స్టైఫండ్ అందచేస్తారు.
* ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు. వీరికి రూ.10 లక్షలకు జీవిత బీమా, రూ.5 లక్షలకు ప్రమాద బీమా కల్పిస్తామన్నారు.
* ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Encounter: కొత్త సంవత్సరాన్ని ఎన్‌కౌంటర్‌తో ప్రారంభించిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *