Life Style Tips

Life Style Tips: ఎండలు పెరిగితే చిరాకు ఎందుకు పెరుగుతుంది?..ఎండలకు మీ మెదడుకు ఉన్న షాకింగ్ కనెక్షన్ ఇదే!

Life Style Tips: వేసవి ఎండలు, వడగాలుల వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి మానసిక అలసట, చిరాకుకు దారితీస్తుంది. దీనికి తోడు నిద్రలేమి, డీహైడ్రేషన్ వల్ల గుండె దడ పెరిగి యాంగ్జైటీ ఎటాక్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కాలంలో మెదడును కూల్ గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం, మసాలాలు తగ్గించడం, మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

మరింత Life Style Tips: ఎండలు పెరిగితే చిరాకు ఎందుకు పెరుగుతుంది?..ఎండలకు మీ మెదడుకు ఉన్న షాకింగ్ కనెక్షన్ ఇదే!
Pawan Kalyan

Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: రాజమండ్రి పర్యటనలో భాగంగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకట్‌నగరం వద్ద గోదావరి నీటి కాలుష్యాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించారు. ఏలూరు లాంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే గోదావరిని శుద్ధి చేయాలని, దీనికి బడ్జెట్ అవసరమైతే క్యాబినెట్‌లో మాట్లాడతానని చెప్పారు. కలుషిత వ్యర్థాల నివారణపై మంత్రి కందుల దుర్గేష్ పూర్తి బాధ్యత తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

మరింత Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!
Mahesh - Neel: 

Mahesh – Neel: నీల్ తో మహేష్ సినిమా కష్టమే.. ఎందుకో తెలుసా..?

Mahesh – Neel: ‘డ్రాగన్’ గ్లింప్స్ తర్వాత మహేష్ బాబు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భారీ బజ్ నడుస్తోంది. మహేష్ తన ‘వారణాసి’ తర్వాత నీల్‌తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ‘సలార్ 2’తో మరియు మహేష్ బాబు భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండనున్నారు. అందువల్ల ఈ క్రేజీ కాంబో అధికారికంగా సాకారం కావడానికి చాలా సమయం పడుతుంది.

మరింత Mahesh – Neel: నీల్ తో మహేష్ సినిమా కష్టమే.. ఎందుకో తెలుసా..?
Sun Stroke

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలుల తీవ్రతకు ఒక్కరోజే 77 మంది (తెలంగాణలో 52, ఏపీలో 25) మరణించారు. గత వారం రోజుల్లో ఈ మరణాల సంఖ్య 200 దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో.. మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.

మరింత Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!
US-Iran

US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’

US-Iran: హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసిన ఇరాన్ క్షిపణి కేంద్రంతో పాటు, సముద్రంలో మందుపాతరలు వేస్తున్న రెండు ఇరాన్ రక్షణ పడవలపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు జరిపి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ తన సుసంపన్నమైన యురేనియంను నాశనం కోసం అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో నాశనం చేయాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.

మరింత US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’
mAadhaar

mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!

mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో పాత ఎమ్-ఆధార్ (mAadhaar) యాప్ త్వరలోనే క్లోజ్ కానుంది. దానికి బదులుగా క్యూఆర్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన సరికొత్త ‘Aadhaar’ యాప్‌ను UIDAI అందుబాటులోకి తెచ్చింది. అలాగే మై ఆధార్ పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ గడువును జూన్ 14, 2027 వరకు పొడిగించారు.

మరింత mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!
Nara Lokesh

Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!

Nara Lokesh: మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అనుమానించినందుకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని ఆపడానికి, గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా జగన్ కోర్టుల్లో కేసులు వేయించారని లోకేష్ ఆరోపించారు.

మరింత Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!
CNG Prices Hiked

CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!

దేశంలో సీఎన్‌జీ (CNG) ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో కిలోకు రూ.2 పెంచడంతో ప్రస్తుత ధర రూ.83.09 కి చేరింది. మే 15 నుంచి కేవలం 11 రోజుల్లోనే సీఎన్‌జీ ధర పెరగడం ఇది నాలుగో సారి (మొత్తం రూ.6 పెంపు). పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆటో, క్యాబ్ చార్జీలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుంది.

మరింత CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!
Maa Inti Bangaram

Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!

Maa Inti Bangaram: సమంత-నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ విడుదలైంది. సమంత స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె మొదట అమాయకపు ఉమ్మడి కుటుంబ కోడలిగా కనిపించి, ఆ తర్వాత తన ఫ్యామిలీ కోసం ఆయుధం పట్టిన యాక్షన్ గృహిణిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

మరింత Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!
Pawan Kalyan

Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే

Pawan Kalyan: రాజమండ్రి జనసేన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం కోసం చిన్న విషయాలను వదిలేయాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించనని చెప్పారు. తానే ఇకపై పూర్తి కమాండర్‌గా ఉండి ఆగస్టు 14 నాటికి కమిటీలు పూర్తి చేస్తానన్నారు. అమిత్ షాతో తాను జగన్ బెయిల్ రద్దు గురించి మాట్లాడినట్లు వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. వ్యవస్థలను అవమానించవద్దని హితవు పలికారు.

మరింత Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే