Alapati Suresh

Alapati Suresh: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్

Alapati Suresh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీకి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. అనుభవజ్ఞుడైన సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేశ్ ఈ పదవిలో కొనసాగనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆయన్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ప్రకటించింది.

సురేశ్ ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు సేవలు అందించనున్నారు. ఆయనకు సంబంధించిన జీత భత్యాలు, ఇతర సౌకర్యాలపై వివరాలతో కూడిన మరో జీవో త్వరలో విడుదల కానుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సమాచార, ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ తగిన ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా సూచించింది.

Also Read: AP Govt: వైఎస్సార్‌ జిల్లా పేరు మార్పు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Alapati Suresh: పత్రికా రంగంలో విశేష అనుభవం ఉన్న ఆలపాటి సురేశ్ నియామకంపై జర్నలిస్టుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జర్నలిస్టుల సంక్షేమం, పత్రికా విలువల పరిరక్షణ కోసం ఆయన కృషి చేస్తారన్న నమ్మకాన్ని జాప్ నేత వి. సత్యనారాయణ వ్యక్తం చేశారు.

ప్రెస్ అకాడమీ ప్రధానంగా పాత్రికేయులకు శిక్షణ, పరిశోధన, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి కీలక బాధ్యతను సీనియర్ జర్నలిస్టు తీసుకోవడం పత్రికా రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Raghurama Krishnam Raju: RRR హత్యకి కుట్ర..పటించుకొని పోలీసులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *