Kasturi: నటి కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ, తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు 60 ఏళ్లుగా రాష్ట్రంలో “ఉదయించే సూర్యుడికి శత్రువు”గా ఉన్నాయని చెప్పారు. ఆమె రాజకీయ పార్టీలు వారి గుర్తులపై చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాలలో వివాదం రేపే అవకాశం ఉంది.
కస్తూరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కీలక పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఉదయించే సూర్యుడికి శత్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉందన్నారు. ఇక కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన నటుడు విజయ్ ఇంకా పార్టీ గుర్తు తీసుకోలేదని, ఆయన ఏ చిహ్నం తీసుకోనున్నారో తెలియదన్నారు. ఓ పార్టీ కూటమికి వ్యతిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయని, అవన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని కస్తూరి అన్నారు. తమ సమస్యలన్నింటికీ అధికార పార్టీనే కారణమన్న మానసికస్థితికి ప్రజలు వచ్చేశారన్నారు.
ఇక తాను జైలుకు వెళ్లినప్పుడు తనకు మద్దతుగా మొదట మాట్లాడిన వ్యక్తి సీమాన్ అని ఆమె పేర్కొన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సీమాన్ కూడా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నారని కస్తూరి చెప్పారు.