Nirmala Sitharaman

Nirmala Sitharaman: ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత రాహుల్ కు లేదు!

Nirmala Sitharaman: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కు భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘2010లో తయారీ రంగంలో 15.3 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 12.6 శాతానికి తగ్గింది. “ఉత్తమ కంపెనీలు ఉన్నప్పటికీ, మనం ఉత్పత్తి వ్యవస్థను చైనాకు అప్పగించాము” అని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ విషయంలో నిర్మలా సీతారామన్ ఒక ఆంగ్ల వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

“కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కు భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత లేదు. అతనికి తగినంత అర్హత లేదు. అతనికి మూర్ఖమైన ఆత్మవిశ్వాసం ఉంది.” అని నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో, వారు భారతదేశ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. మీ పాలనలో, మీరు చైనాను సందర్శించి ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఆ ఒప్పందంలో ఏముందో మీరు ఎందుకు వెల్లడించలేదు? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: మహాకుంభమేళా లో స్నానం చేసిన భూటాన్ రాజు..

కాంగ్రెస్ పాలనలో చైనా కాశ్మీర్ – లడఖ్ నుండి ఎంత భూమిని ఆక్రమించిందో మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ పదేళ్ల పాలనలో మీరు ఏం చేశారు? మీరు కనీసం ఒక యూనిట్ అయినా నిర్మించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కాంగ్రెస్ దశాబ్దం పాలన తర్వాత, వారు వదిలి వెళ్ళిన సమస్యలను పరిష్కరించడానికి మేము నాలుగు నుండి ఐదు సంవత్సరాలు గడిపాము. ఆర్థిక వ్యవస్థలో మనం 5వ స్థానానికి చేరుకున్నాము. రాబోయే రెండేళ్లలో మనం మూడవ స్థానానికి చేరుకుంటాం అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివృద్ధిని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *