Miss World 2025 Grand Finale: ప్రపంచ అందాల పోటీ మిస్ వరల్డ్ 2025 చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి సారిగా భారత్లోని తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్కు వేదికవడం విశేషం. గత నెల నుంచి ఘనంగా సాగిన ఈ అంతర్జాతీయ అందాల పోటీకి ఈరోజుతో తెరపడనుంది. మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న గ్రాండ్ ఫినాలేకు ప్రపంచం మొత్తం కళ్లేర్పాటుగా మారింది.
ప్రత్యక్ష ప్రసారం, స్టార్ హోస్ట్స్
మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే కార్యక్రమం సోనీ లివ్లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ ఈవెంట్ను మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలే, ఇండియన్ యాంకర్ సచిన్ కుంభార్ కలిసి హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ గ్లామర్ను జోడించేందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఫైనలిస్టుల పోరాటం – ఎవరిది ఆ గౌరవం?
108 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్న ఈ పోటీల్లో, ప్రస్తుతం 16 మంది ఫైనలిస్టులు తుది పోరులో నిలిచారు. వీరిలో:
-
నందిని గుప్తా (భారతదేశం)
-
అన్నాలిస్ నాంటన్
-
ఆరేలీ జోచిమ్
-
వలేరియా పెరెజ్
-
మోనికా కెజియా
-
నటాషా న్యోనోజి
-
ప్రిన్సెస్ ఇస్సి
-
జాస్మిన్ గెర్హార్డ్
-
ఇతరులు..
ఈ పోటీలో ఖండాల వారీగా టాప్ 10 ఫైనలిస్టులు ఎంపిక చేయబడతారు. ఆ తర్వాత టాప్ 5, ఆపై టాప్ 2 ఎంపిక చేసి, చివరగా కాంటినెంటల్ విజేతలలో ఒకరిని మిస్ వరల్డ్గా ప్రకటిస్తారు.
న్యాయ నిర్ణేతల ప్రత్యేకత
ఈ వేడుకకు జ్యూరీ సభ్యులుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్, మిస్ ఇంగ్లండ్ 2014 డాక్టర్ కారీనా టర్రెల్, బిసినెస్వుమన్ సుధా రెడ్డి, మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మోర్లే తదితరులు వ్యవహరిస్తున్నారు. సోనూసూద్కు ఈ సందర్భంగా మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును కూడా అందించనున్నారు.
కిరీటం ఎవరిదీ..?
మిస్ వరల్డ్ 2024 టైటిల్ విజేత క్రిస్టినా పిజ్కోవా నూతన విజేతకు కిరీటం అలంకరించనుంది. ఫైనల్ రౌండ్లో నలుగురు అభ్యర్థులకు ఓ సాధారణ ప్రశ్నను అడిగి, వారి సమాధానాల ఆధారంగా విజేతను ఎంపిక చేయనున్నారు.
మిస్ వరల్డ్ బాధ్యతలు
మిస్ వరల్డ్గా ఎంపికైన వ్యక్తి ఓ దేశపు మోహన రూపమే కాకుండా, ప్రపంచానికి సామాజిక బాధ్యతల ప్రతినిధిగా నిలవాలి. ఆమె చారిటీ కార్యక్రమాలు, అక్షరాస్యత ప్రచారం, హ్యూమానిటేరియన్ ప్రాజెక్ట్స్లో భాగస్వామ్యం వహిస్తూ, ప్రపంచాన్ని చుట్టి మానవత్వానికి మద్దతుగా పనిచేస్తుంది.