AMARAVATI: ఏపీలో అకాల వర్షాల బీభత్సం – పది మంది మృతి

AMARAVATI: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లాలో 4, బాపట్లలో 2, ప్రకాశంలో 2, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే, వాతావరణ శాఖ రేపు రాష్ట్రవ్యాప్తంగా మరింత వర్ష సూచన జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయనిపించింది. మరో 19 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.

వీటి కారణంగా పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో నీటి ప్రవాహం పెరగడంతో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TDP: టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *