Vizag: ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో అగ్ని ప్రమాదం

Vizag: విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశాఖపట్నం జైల్ రోడ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన స్థానికలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దట్టంగా పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఎస్బీఐ కు వెనుకవైపు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. మంటల్ని అదుపుచేసేందుకు టూ టీమ్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Champions Trophy 2025: తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్న విరాట్ కోహ్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *