Telangana

Telangana: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామంలో ఓ ఇంట్లో క్షుద్రపూజల కలకలం

Telangana: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కన్నెపల్లి గ్రామంలో ఓ పాడు బడ్డ ఇంట్లో క్షుద్రపూజల తంతు కలకలం రేపింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేస్తుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ముచ్చట తెలియని దుండగులు గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు నిర్వహించారు.

గుప్త నిధి జాడ సంగతేమో కానీ … పక్కా టైమింగ్‌తో ఖాకీలు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇల్లంతా పసుపు కుంకుమ నిమ్మకాయాలతో క్షద్రపూజల సీన్‌ కంటపడింది. లోనికి వెళ్తే తవ్వకాలు జరుగుతున్నాయి. రెడ్‌హ్యాండెడ్‌గా నులుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Telangana: వారి‌ వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, ఒక ఆటో, తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీస్తే గుప్తనిధి అన్వేషణ వ్యవహారం బయటపడింది. పోలీసుల రాకడను పసిగట్టిన ఇంటి యజమాని మహేష్‌తో పాటు మరో ఇద్దరు‌ వ్యక్తులు ఎస్కేపయ్యారు.

ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సాకెర గ్రామంలో కూడా ఇలానే గుప్త నిధుల కోసం ఓ పొలంలో తవ్వకాలు జరిపారు.స్థానికులు అడ్డుకోవడంతో గుప్తనిధి ముఠా పరారైంది. తక్కువ సమయంలో కోటీశ్వరులవ్వాలనే అత్యాశ తో కొందరు గుప్తనిధుల ముఠాలో ట్రాప్‌లో పడుతున్నారు.. అత్యాశకు పోతే నిండా మునగడం ఖాయం..అలాంటి ముఠాలను నమ్మోద్దన్నారు పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Seetharamula Kalyanam: తలంబ్రాల కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *