Ticket Prices: గత రెండు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) ఊహించని రేంజ్లో ఊపు వచ్చింది. ప్రతి వారాంతంలో థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. ఎంతలా అంటే.. సాధారణ వారపు రోజుల్లో (Weekdays) కూడా సాయంత్రం షోలు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
సినిమాలు వరుసగా విజయం సాధించడానికి చాలా కారణాలు ఉండవచ్చు, కానీ వాటన్నింటికంటే ప్రధానమైనది మాత్రం “సామాన్యుడికి అందుబాటులో ఉన్న టికెట్ ధరలు” అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రీజనబుల్ ధరలే అసలైన సీక్రెట్!
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో రామ్ చరణ్ ‘పెద్ది’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను మినహాయిస్తే, ఇటీవల వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సాధారణ రీజనబుల్ ధరలకే టికెట్లను అందుబాటులో ఉంచాయి.
-
ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ ఊరట: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 177 పరిధిలోనే ఉండటం సాధారణ ప్రేక్షకుడికి పెద్ద ఊరటగా మారింది. కుటుంబంతో కలిసి థియేటర్కు వచ్చే సగటు సినిమా లవర్స్ ఈ ధరలతో చాలా హ్యాపీగా ఉన్నారు.
-
బాక్సాఫీస్ వద్ద హిట్ల పరంపర: ‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’, ‘మా ఇంటి బంగారం’ వంటి సినిమాలు అందుబాటు ధరలకే టికెట్లు అమ్మడం వల్ల సక్సెస్ ఫుల్ వెంచర్లుగా నిలిచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.
ఒకటి చూసే చోట.. మూడు సినిమాలు చూస్తున్న జనం!
ఈ వరుస విజయాలను గమనిస్తున్న సినీ విశ్లేషకులు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఒక కీలక సూచన చేస్తున్నారు. టికెట్ ధరలు సామాన్యుడి బడ్జెట్కు సరిపోయేలా ఉంటే.. ఒక సినిమా చూసి ఆగిపోయే ప్రేక్షకుడు ఏకంగా రెండు లేదా మూడు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది చివరికి మొత్తం సినిమా ఇండస్ట్రీకె ఎంతో మేలు చేస్తుంది.
రాబోయే రోజుల్లో విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’, ‘మకుటం’, ‘అగద’, ‘పాలల్బురుసు’ వంటి సినిమాలు కూడా ఇదే సరసమైన టికెట్ ధరల వ్యూహాన్ని అనుసరిస్తే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ నిర్మాతలు ఈ ‘పాకెట్ ఫ్రెండ్లీ’ ట్రెండ్ను ఎంతవరకు కొనసాగిస్తారో చూడాలి!
