ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు.. ఉప్పు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. WHO చెప్పినట్లుగా రోజుకు మనిషి గరిష్టంగా 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ మనిషి సాధారణంగా రోజుకు 10 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటారు, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. WHO మార్గదర్శకాల ప్రకారం, సాధారణంగా ఉపయోగించే టేబుల్ సాల్ట్ కు బదులుగా, మీరు తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం ఉన్న ఉప్పును ఉపయోగించవచ్చు. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి?
* గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదం
* మూత్రపిండాలు, కాలేయ వైఫల్యం
* నీటి నష్టం, నిర్జలీకరణం
* ఎముకలు బలహీనపడటం
పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి సాధారణ ఉప్పు మంచిదని, తక్కువ సోడియం ఉప్పు అవసరం లేదని WHO పేర్కొంది.
ఇది కూడా చదవండి: Leave Rejected: వీడి ఫస్ట్రేషన్ తగలెయ్య.. సెలవు ఇవ్వలేదని నలుగురిని పొడిచి పడేశాడు!
భారతీయుల ఆహారపు అలవాట్లలో ఉప్పు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, అధిక ఉప్పు ప్రభావాలను నివారించడానికి WHO నుండి వచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలి. తక్కువ సోడియం కలిగిన ఉప్పు ఆహారానికి అనుకూలంగా ఉంటుంది మరియు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.