Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక నాయకులు పాసికంటి రమ్య సత్యనారాయణ గారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని పార్టీ ముఖ్య నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ తుల ఉమా మరియు మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రారంభోత్సవంలో 31వ వార్డు ఇంచార్జి అందె శుభాష్, వార్డు అధ్యక్షులు బాబు, నాయకులు ఇజ్జగిరి, శాంతక్క, లవన్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా వార్డు మహిళలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
