TDGP: తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వీరి పూర్తి వివరాలతో కూడిన జాబితా ఇప్పటికే పోలీసుల వద్ద ఉందని తెలిపారు.
ఈ 17 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే, తెలంగాణ పూర్తిగా మావోయిస్టు ప్రభావం నుంచి విముక్తమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు
