Srivari Brahmotsavam 2024: బ్రహ్మానంద రూపుడు.. తిరుమల వాసుడు శ్రీశ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అంటే ఈనెల 4 నుంచి 12 వరకూ శ్రీవారికి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఈరోజు (అక్టోబర్ 3) రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
అంకురార్పణ అంటే..
Srivari Brahmotsavam 2024: ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అది విజయవంతంగా పూర్తి కావాలని కోరుతూ భగవంతుని ప్రార్ధిస్తూ అంకురార్పణ జరుపుతారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ అత్యంత ముఖ్యమైనది. శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళతారు. బ్రహ్మోత్సవాలకు జరిగిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తరువాత ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుట్టమన్నును మట్టి మూకుళ్ళల్లో ఉంచి నవధాన్యాలను పోస్తారు. వీటికి నీరు పోసి మొలకలు వచ్చేలా చేస్తారు. అందుకే దీనిని అంకురార్పణ అంటారు. సాయంత్ర సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకంటే, రాత్రి వేళలో చంద్రకాంతికి ఈ విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం కల్పించడం కోసం. చంద్రుడు అంటే సత్య కారుడు. అందుకే, ఈ కాంతిలో విత్తనాలు మొలకెత్తడం శుభప్రదంగా భావిస్తారు.
Srivari Brahmotsavam 2024: ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే.. అంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని ఒక నమ్మకం. అంకురార్పణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్నీ సిద్ధం అయిపోయినట్టు లెక్కన్నమాట. రేపు అంటే అక్టోబర్ 4న జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు అవుతాయి.
ధ్వజారోహణానికి ఏర్పాట్లు పూర్తి..
Srivari Brahmotsavam 2024: రేపు అంటే అక్టోబర్ 4న ప్రారంభం అయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి కార్యక్రమం ధ్వజారోహణం. దీని కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ధ్వజారోహణకు ఉపయోగలించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీశాఖ కార్యాలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. డిఎఫ్వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా వీటిని తీసుకువచ్చి వేంకటేశుని ఆలయంలోని శేష వాహనంపై ఉంచారు.
Also Read: తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం పలాస జీడిపప్పు!
దర్భ చాప, తాడు ప్రత్యేకత ఇదే..
ధ్వజారోహణం అంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ముల్లోకాలకు.. ముక్కోటి దేవతలకు తెలియచేయడం. దేవతలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం. దీనికోసం ధ్వజ స్తంభంపైకి గరుడ పతాకను ఎగుర వేస్తారు. రుత్వికులు వేదం మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభానికి చుడతారు. తరువాత దర్భతో తయారు చేసిన తాడును ధ్వజ స్తంభంపై వరకూ చుడతారు.
ఏర్పేడు మండలం నుంచి..
Srivari Brahmotsavam 2024: దర్భల్లో విష్ణు దర్భ, శివ దర్భ అని రెండురకాలు ఉంటాయి. విష్ణు దర్భను శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఉపయోగిస్తారు. ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Andhra Pradesh: Tirumala Venkateshwara Temple in Tirupati illuminated ahead of the annual ‘Brahmotsavam’ celebrations. pic.twitter.com/nKKCwqgdLX
— ANI (@ANI) October 2, 2024