Shruti Haasan: స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్ సీజన్ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తోంది. గోత్ థీమ్తో క్రిస్మస్ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్ను శ్రుతీ జోడించింది. యూనిక్గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను శ్రుతీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే గత యేడాది ‘’వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1’’ చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు.
ఇది కూడా చదవండి: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రశ్మిక చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి
Shruti Haasan: అయితే అభిమానులు మాత్రం 2025లో సరికొత్త చిత్రాల్లో ఆమెను చూడబోతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న ‘సలార్ 2’ చిత్రం కూడా వచ్చే ఏడాదిలో సందడి చేయనుందని సమాచారం. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా పైల్ లైన్ లో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో శ్రుతీ వాటికి సంబంధించిన వివరాలు తెలియచేస్తుందని అంటున్నారు.