Road Accident

Road Accident: యాదాద్రి భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాయగిరి దగ్గర హైవేపై చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టిటడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి వెనక నుండి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ పంపులోకి వెళ్తున్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  School Teachers: స్కూల్లో పిల్లలను కొట్టే టీచర్లకు పెద్ద షాక్.. ఇకపై అలా చేస్తే కేసులతో సరదా తీర్చేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *