rajendra prasad: థియేటర్లు మూసివేత చిన్న విషయం కాదు: రాజేంద్రప్రసాద్

rajendra prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల చోటుచేసుకున్న థియేటర్ల బంద్ వార్తలపై స్పందించారు. థియేటర్లు మూసివేయడం ఒక చిన్న విషయం కాదని, ఇది బాధ్యతాయుతంగా తీసుకోవలసిన సమిష్టి నిర్ణయమని అన్నారు. ఎవరో కావాలనే తప్పుడు వార్తలు సృష్టించి అందరినీ తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన కొత్త చిత్రం ‘షష్టిపూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మే 30న విడుదల కానుంది.

“ఇలాంటివి ఇక జరగకూడదు” – రాజేంద్రప్రసాద్ ఆవేదన

“ఒకరు చెబితే థియేటర్లు మూసేయడం అనేది సాధ్యపడదు. ఎవరో కావాలనే ఈ వార్తలు సృష్టించారు. కానీ చివరకు ఆ నిర్ణయం నిలబడలేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే, అవి సృష్టించినవారిని కనుగొనాలి. థియేటర్ల బంద్ అనేది చిన్న మాట కాదు. ఇటువంటి సమస్యలపై సమాధానం వచ్చేలా చూడాలి,” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకుని, అసలు విషయాన్ని వెలికితీయాలని కోరిన విషయాన్ని ఆయన హర్షించారు.

“డబ్బు కోసమే నేను సినిమాలు చేయలేదు”

“నేను సినిమాలు డబ్బు కోసమే చేయలేదు. నేను సంపాదించిన డబ్బుతో బడా హీరోల లాగే పెట్టుబడులు పెట్టి ఉంటే, ఈపాటికి హైదరాబాదు, మద్రాసుల‌లో వేల కోట్ల ఆస్తులు ఉండేవి. కానీ నాకు డబ్బు కాదు, మంచి సినిమాలే ముఖ్యం,” అని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌పై మాట్లాడుతూ, “ఆయన నాకు తమ్ముడిలాంటి వాడు. అయితే ఇప్పటివరకు ఆయ‌న సినిమాల్లో న‌టించే అవ‌కాశం రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా ఆ అవకాశం రావాలని ఆశిస్తున్నాను,” అన్నారు.

38 ఏళ్ల తర్వాత మళ్లీ ‘లేడీస్ టైలర్’ జోడీ

రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా 38 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. రూపేశ్, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hajj: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్ళేది ఎంతమంది అంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *