Raghunandan rao: ఔటర్ రింగురోడ్డు దగ్గర ఓ మంత్రి 85 ఎకరాలు కబ్జా చేయాలని చూస్తుండు..

Raghunandan rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు రామచంద్రాపురం శంకర్‌పల్లి మండలాల మధ్య ఉన్న 85 ఎకరాల భూమిని ఓ మంత్రి తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

గిరిజన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ, “మూడు తరాలుగా ఆ భూములపై హక్కుతో ఉన్న గిరిజన రైతులకు పట్టాలు అందించి న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, శంకర్‌పల్లి మండలాల మధ్య ఉన్న భూవివాదం చాలా కాలంగా కొనసాగుతోందని, ఇప్పుడా భూముల విలువ సుమారు రూ.1,500 కోట్లుగా ఉందని తెలిపారు.

పేదల భూముల కబ్జాకు ప్రయత్నాలు

రఘునందన్ రావు ఆరోపణలు చేస్తూ, కొందరు ప్రజా ప్రతినిధులు ప్రజల భూములను కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. పేద ప్రజల భూములను కాపాడేందుకు ధరణి పద్ధతిని రద్దు చేసి భూమాత చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పిన మంత్రి, ఇప్పుడు అదే పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుండడం విపరీతమన్నారు.

ప్రజలపై పోలీసుల బెదిరింపులు

పేద ప్రజల హక్కులకు నిలబడే వారిని పోలీసులు ఉపయోగించి బెదిరిస్తున్నారని, దీనిని ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినప్పటికీ ప్రజల జీవన స్థితిలో మార్పు రాలేదని, ఒక్క పార్టీ రంగు మారడంతో ప్రజల సమస్యలు తీరవని అన్నారు.

కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పేదల ఖాళీ స్థలాలు మరియు భూములు కాంగ్రెస్ నేతల కబ్జాకు గురవుతున్నాయని, దీనిపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూవివాదం నేపథ్యంలో ప్రజలకు న్యాయం చేయడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nizamabad: వీడెవ‌డండీ బాబు.. రైలుకు ఎదురెళ్తుండు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *