Chhattisgarh: భారీ ఎన్ కౌంటర్..17 మంది స్పాట్..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది నక్సలైట్లు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంతాల అడవుల్లో ఉదయం 9 గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నెలలో ఇది రెండవ ఎన్‌కౌంటర్.

మూడు జిల్లాల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ బలగాలు కలిసి నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి.

ఇదే బీజాపూర్ జిల్లాలో జనవరి 12న జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు నక్సలైట్లు మరణించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *