Pm modi: అటల్ బీహారీ వాజపేయి జయంతి.. 100 నాణెం విడుదల

Pm modi: దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించబడాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయీ శతజయంతి ప్రత్యేకతను చాటిచెప్పే ఈ నాణేంతో పాటు ప్రత్యేక స్టాంప్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు.

ఇదే సందర్భంలో, ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక కేంద్రంలో పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలు ఉంచి వాజ్‌పేయీకి నివాళి అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా అనేక మంది నేతలు వాజ్‌పేయీకి ఘన నివాళులు అర్పించారు.

అటల్ బిహారి వాజ్‌పేయీ భారత రాజకీయాల్లో ఓ స్ఫూర్తిదాయక నాయకుడు. ఆయన కేవలం ఒక రాజకీయ నేత మాత్రమే కాకుండా, గొప్ప కవి, దేశాభివృద్ధికి పరితపించే దార్శనికుడు. ఆయన సేవలు దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వక్తలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BJP Election In Charges: ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *