Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్పై అపారమైన అభిమానంతో చరిత్ర సృష్టించారు. పవన్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్న ఆమె, తన పింఛను సొమ్ము నుంచి నెలకు రూ.2,500 పోగు చేసి, రూ.27 వేలతో గరగను సమర్పించారు. పవన్తో కలిసి భోజనం చేయాలన్న ఆమె కోరిక తెలిసిన వెంటనే, ఆయన స్పందించారు.ఈ రోజు పేరంటాలు గారిని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, ఆమెతో కలిసి భోజనం చేసి, సన్మానించారు. అంతేకాదు, ఆమెకు చీర, లక్ష రూపాయల నగదును బహుమతిగా అందించి గౌరవించారు. ఈ హృదయస్పర్శి సంఘటన స్థానికంగా చర్చనీయాంసమైంది. పవన్పై అభిమానంతో మొక్కుకున్న ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి, తన సరళత, సానుభూతితో అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ సంఘటన పవన్ జనసేనానిగా మాత్రమే కాక, జననాయకుడిగా ఆయన ప్రజలతో ఉన్న అనుబంధాన్ని చాటుతోంది.
