Pakistan Coach: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దయనీయంగా తయారయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు మొదట న్యూజిలాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోయింది. 29 సంవత్సరాల తర్వాత ఒక ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్, టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు ఓటమికి ఒకరినొకరు నిందిస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కోచ్ ఆకిబ్ జావేద్ కూడా జట్టు ప్రదర్శనపై కీలక ప్రకటన చేశారు.
పాకిస్థాన్ కోచ్ ఆకిబ్ జావేద్, జట్టు పేలవ ప్రదర్శనకు కొన్ని కారణాలు వివరించారు. తమ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడమే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడానికి ప్రధాన కారణమని అన్నారు. పాకిస్థాన్ మరియు భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇద్దరి దేశాల అభిమానులతో పాటు ప్రపంచమంతా ఆసక్తితో చూస్తుందని ఆకిబ్ జావేద్ పేర్కొన్నారు.
భారత జట్టు చాలా అనుభవజ్ఞులను కలిగి ఉందని, ఆ జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా 1500 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారని ఆయన వివరించారు. అయితే, పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లు కేవలం 400 మ్యాచ్లు మాత్రమే సమిష్టిగా ఆడారని చెప్పారు.
Also Read: Danish Malewar: రంజీ ఫైనల్లో సెంచరీతో అదరగొట్టిన డానిష్ మలేవార్..! కొత్త స్టార్ పుట్టుకొచ్చాడా?
Pakistan Coach: బాబర్ అజం అత్యంత అనుభవజ్ఞుడని, అతను 100 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడని, అతని తర్వాత మహమ్మద్ రిజ్వాన్ మరియు షాహీన్ అఫ్రీది ఉన్నారని ఆకిబ్ జావేద్ తెలిపారు. మిగిలిన ఆటగాళ్లు 30 కంటే తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడారని అన్నారు.
భారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో అనుభవం చాలా ముఖ్యమని, అనుభవం లేకపోవడమే ఓటమికి కారణమని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు తమ అంచనాలకి తగినట్లుగా ప్రదర్శించలేదని కూడా ఆకిబ్ జావేద్ అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్… మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ను 60 పరుగుల తేడాతో ఓడించింది. తర్వాతి మ్యాచ్లో భారత జట్టు పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రోజు బంగ్లాదేశ్ తో జరుగుతున్న తన చివరి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణానికి స్వస్తి పలకనుంది.