Nivin Pauly-Mamitha Baiju: మలయాళ స్టార్ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ హీరోగా భావన స్టూడియోస్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ అనే రొమాంటిక్ కథా చిత్రంని రూపొందిస్తుంది. ‘ప్రేమలు’ విజయం తర్వాత గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివిన్ పౌలీ సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. విష్ణు విజయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనుంది.
Also Read: Dhanush: శరవేగంగా ధనుష్ కొత్త సినిమా షూటింగ్!
Nivin Pauly-Mamitha Baiju: ఈ చిత్రం, కుటుంబ కథాంశంతో పాటు యువతను ఆకర్షించే అంశాలతో నిండి ఉంటుందని టీమ్ వెల్లడించింది. గిరీష్ ఏడీ మార్క్తో వస్తున్న ఈ సినిమా, అతని మునుపటి చిత్రాల్లాగే సహజమైన హాస్యం, హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. నివిన్ పౌలీ, మమితా బైజు జోడీ కెమిస్ట్రీతో ఈ సినిమా హైలైట్గా నిలవనుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు మరో హిట్ అందించేందుకు టీమ్ సిద్ధంగా ఉంది.
Bethlehem Kudumba Unit!☺️
With Girish A.D,@_mamithabaiju & @BhavanaStudios.
Let’s create something special! ❤️#GirishAD #MamithaBaiju #BhavanaStudios #BethlehemKudumbaUnit pic.twitter.com/DmNCFEnIyB
— Nivin Pauly (@NivinOfficial) July 4, 2025