Birds Death

Birds Death: పాపం.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన పక్షులు

Birds Death: సాంబార్ సరస్సు రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఉంది. ఈ సరస్సు దగ్గరకు వేలాది మైళ్ళ దూరం నుంచి అనేక విదేశీ పక్షులు ప్రతి ఏటా వస్తాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లలను చేసుకుని తరువాత పిల్లలతో సహా వెనక్కి వెళ్లిపోతాయి.  

ఈ ఏడాది కూడా అలానే చాలా పక్షులు ఈ సరస్సు వద్దకు వచ్చాయి. అయితే.. గత నెల 26వ తేదీ నుంచి ఇక్కడ పక్షులు చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 520 పక్షులు చనిపోయాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగింది. పక్షుల మృతిపై పరిశోధన మొదలైంది. 

ఇది కూడా చదవండి: Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు

ఈ రీసర్చ్ లో పక్షులకు కొన్ని రకాల బ్యాక్టీరియా సోకినట్లు కనుగొన్నారు.  క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్తీరియా కారణంగా ఇలా జరిగినట్టు నిర్ధారించారు. ఈ బాక్తీరియా సోకిన పక్షులు ఈకలు రాలిపోవడం.. కాళ్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో చనిపోతాయని పరిశోధకులు చెప్పారు. పక్షులను రక్షించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అస్వస్థతకు గురైన పక్షులకు చికిత్స అందిస్తున్నామని, బాక్టీరియా నివారణ చర్యలు తీసుకుంటున్నామని సామాజిక కార్యకర్తలు తెలియజేసారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijay Deverakonda, Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక పెళ్లి అయిందా? ఫొటోలు వైర‌ల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *